'ఓరీ, వెర్రివాడా! వాంఛా? మన యీ అల్పజీవితములలో సరియైన మార్గాన్ని నడచినట్లయితే వాంఛే ఉన్నతమైంది అవుతుంది. నీ భార్య కానున్న యామెను వాంఛించుట ఎలాటి తప్పు? సరే యిష్టపడ్డావు. నీకు ప్రేమ, సంతోషం మాటలచేగాక చేతలచే చూపిస్తే సిగ్గు. అయినా నిన్ను కౌగిలించుకుంటున్నా!'' యనెను. నారాయణరావు హృదయం వేయి పాలసముద్రముల మునిగినట్లయినది. తత్క్షణమే యాతడు శ్యామసుందరీదేవికి బెద్దయుత్తరము వ్రాసినాడు.
Adavi Baapiraju or Aḍivi Bāpirāju (1895–1952) was a famous Telugu novelist, poet, playwright, painter and art director. He was born on October 8, 1895 at Sarepalle near Bheemavaram in West Godavari district of Andhra. He is known for his works like Gonaganna Reddy, Narayanarao, Himabindu etc.
స్ఫురద్రూపమూ, ఆ రూపంతో పోటీ పడుతున్నాయా అనిపించే గుణగణాలు.
లలిత కళలు, రాజకీయం, పాశ్చాత్య తత్త్వము, భారతీయ వేదాంతము - అన్నీ ఇతనికి కొట్టిన పిండి. ఏ విషయం మీదనైనా అనర్గళంగా ఉపన్యసించగలడు.
తల్లిదండ్రులు ఇటువంటి కొడుకు ఉంటే బాగుణ్ణు అనుకుంటారు. ఆడపిల్లలు ఇటువంటి అన్న ఉంటే బాగుణ్ణు అనుకుంటారు. ఇటువంటి మిత్రుడు తమకుండుట ఏ జన్మ వరమో అని ఆతని మిత్రులు భావిస్తారు.
అతడు మైళ్లకి మైళ్ళు వరద నీటిలో ఈదగలడు.
తోక పట్టుకుని పరిగెత్తే పశువును ఆపగలడు.
రైలు కింద ప్రమాదవశాత్తు పడబోయిన అభాగ్యుడిని వెంట్రుక వాసిలో కాపాడగలడు.
తనని చెయ్యెత్తి కొట్టబోయిన తెల్లదొర గర్వం అణచగలడు.
మంటల్లో ఇళ్లు తగులబడిపోతుంటే ఒక్క క్షణం ఆలోచించక అందులోకి దూకగలడు.
చెల్లికి చదువు చెప్పాలంటే... నారాయణరావు.
అక్క కాపురం సరిదిద్దాలంటే... నారాయణరావు.
బావగారికి బుద్ధి చెప్పాలంటే... నారాయణరావు.
మరొక బావను జైల్లోనుంచి విడిపించాలంటే... నారాయణరావు.
తాను అంటే ఇష్టం లేని అత్తగారికి సపర్యలు చేయాలంటే... నారాయణరావు.
తన ఇంటి పాలేర్లు కొట్టుకుంటుంటే విడదీయడానికి... నారాయణరావు.
ఒక మిత్రుడు చెడు దారిలో పడితే సరిదిద్దడానికి.... నారాయణరావు.
మరొక మిత్రుడు బాధలో ఉంటే అతనికి ఓదార్పు... నారాయణరావు.
సంసారం బాగుచేయాలంటే... నారాయణరావు.
పెళ్లి సంబంధం కలపాలంటే... నారాయణరావు.
అన్నింటా నారాయణరావు! అంతటా నారాయణరావు!
నారాయణరావు వంటి స్నేహితుడు నాకు ఉంటే చిటికెలో నా సమస్యలన్నీ తీర్చేసి నన్ను ఒడ్డున పడేసి ఉందును. ప్చ్.
This entire review has been hidden because of spoilers.
ఈ పుస్తకాన్ని నేను దాసుభాషితం ఆప్ లో శ్రవణ పుస్తకంగా చదవటం జరిగింది. అప్పటి కాలం లో రాశిన నవలలు కట్టె కొట్టె తెచ్చె లాగా ఉండకుండా, కాస్త సమాజం గురించి విషయాలు చెబుతూ ఉండేవి, ఈ కాలం నవలలతో వాటిని పోల్చటం తగదు. కధా వస్తువు చూసుకుంటే మరీ కష్టమైనది కాకపోయినా, అప్పటి సమాజం లో ఉన్న బోళ్ళన్ని సూక్ష్మ విషయాల గురించి మనకి ఈ పుస్తకం చెబుతుంది.
పాత్రల మనస్సు చెప్పటానికి అవసరం కొద్ది గంభీర సమసాలే కాకుండ అతి సులువైన భాష కూడా వాడారు. శ్రవణ పుస్తకం కాబట్టి సరిపొయింది కాని, చదవటం కష్టమే!
1934 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించిన తెలుగు నవలల పోటీల్లో ఈ నవల విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగలు నవలతో సమంగా ఉత్తమ నవలగా ఎంపికైన ఈ నవల చదవడానికి ఇంత కష్టపడాలన్న విషయం నవల పూర్తయ్యాకగాని తెలియలేదు.
నేను నవలలోని తెలుగు భాష గురించి మాట్లాడడం లేదు. నవలలోని తెలుగుభాష అత్యంత రమ్యంగా ఉంది. బహుశా అందుకే ఈ నవలకు "వేయిపడగలతో సమానంగా(?) ఉత్తమ నవల" బహుమతి వచ్చిందేమో!
lot of the details of the times from 1920s just not india or hinduism or british rule but about the over all world, science updates of then recent times. overall the book is about social, culture, art and believes with a coated story going on.