నవంబరు 1998 నుండి డిసెంబరు 2002 వరకు నాలుగేళ్ళ పాటు ఆదివారం వార్తలో "సాహిత్య మరమరాలు" ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.
ఒకనాటి ప్రముఖ సాహితీవేత్తల గురించి, వారి రచనల గురించి ఇతర సాహితీవేత్తలు చెప్పిన వివరాలను అందించారు. లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తల రచనలకి సంబంధించి ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన ఈ పుస్తకం నేటి తరం పాఠకులకు తెలియని సంగతులనెన్నో తెలియజేస్తుంది.